షియోమీ సంస్థ ‘రెడ్మీ ఎయిర్డాట్స్’ పేరుతో సరికొత్త బ్లూటూత్ హెడ్సెట్ను మార్చి 18న విడుదల చేసింది.
ఈ కొత్త హెడ్సెట్లో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్లకు సపోర్ట్ను అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా ఈ హెడ్సెట్ పనిచేస్తుంది. 26.6 x 16.4 x 21.6 ఎం.ఎం డైమెన్షన్లో ఈ కొత్త హెడ్సెట్ను రూపొందించారు. ఈ హెడ్సెట్లో మ్యూజిక్ ప్లేబ్యాక్కు టచ్ కంట్రోల్స్ను ఇస్తున్నారు. ఇందులో 40 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీంతో 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
చైనాలో దీని ధర 99.9 యువాన్ (సుమారు రూ.1020)గా నిర్ణయించారు. ఏప్రిల్ 19 నుంచి అక్కడి వినియోగదారులకు ఈ హెడ్సెట్ లభ్యంకానుంది. అయితే గ్లోబల్ మార్కెట్లతోపాటు.. భారత్లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు.