శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజాకైంకార్యాలు, పరోక్షాసేవలు యధావిధిగా కొనసాగనున్నట్లు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు. క్షేత్ర పరిధిలో దుకాణాలు సాయంత్రం 4 వరకు తెరిచేందుకు దేవస్థానం అనుమతించింది.

ఒంటి గంట వరకు శ్రీశైలం మల్లన్న దర్శనం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.