పదిహేను వందల సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్న గ్రంథాలయం
ఈజిప్టులోని ఒక గ్రంథాలయం పదిహేను వందల సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. సెయింట్ కేథరిన్స్ మోనాస్టరీలో క్రీ.శ.565లో ప్రారంభించిన ఈ గ్రంథాలయం ఆనాటి నుంచీ నేటి వరకూ నిరంతరాయంగా సేవలందించడం విశేషం. వాటికన్ సిటీ తర్వాత అత్యంత పురాతన చేతిరాత ప్రతులు ఉన్న గ్రంథాలయం ఇదే.